శ్రీ చాగంటి గారి ప్రవచనములు - శ్రీమద్భాగవతము
భాగము 76
శ్రీకృష్ణుడు తండ్రితో ఇంద్రయాగం వద్దు గోవర్ధనగిరి యాగం చేయమని చెప్తారు
"కల్పము చెప్పటానికి ఏ బ్రహ్మ వస్తారు?" అని అడుగగా ఎవరూ రానవసరం లేదు ఆ యాగానికి ఏమేమి చేస్తారో దీనికి కూడా అవే చేయమని చెప్తారు
యాగం చేసి అందరూ , ఆవులు , దూడలతో సహా కలిసి కూర్చుని భుజించి, గోవర్ధనగిరికి ప్రదక్షిణ చేసి , మిగిలిన పదార్ధాలు అన్నీ గోవర్ధనగిరికి సమర్పించమని చెప్తారు
మరుసటి రోజు అందరూ కలిసి అలాగే చేస్తారు...
గోవిందుడు వచ్చి ఆరగించటం చూసి సంతోషిస్తూ స్తోత్రాలు చేస్తూ ప్రదక్షిణ చేస్తుంటారు
ఆ కోలాహలం విన్న ఇంద్రుడు విషయం తెలిసి కోపంతో ఉరుములు , మెరుపులతో కూడిన వర్షం కురిపిస్తారు
ఆ వర్షానికి ఆవులు,దూడలు భీతిల్లిపోయి కొన్ని చనిపోగా అందరూ కృష్ణుడిని వేడుకుంటారు
వెంటనే కృష్ణుడు గోవర్ధనగిరి ఎత్తి పట్టుకుంటారు
అలా 7 రాత్రులు 7 పగళ్ళు 7 ఏళ్ళ వయస్సులో తన చూపులతో పోషించారు
" నేను బాలుడిని, ఇంత కొండ మొయ్యలేనేమో అని భయపడకండి, బంధువులారా.... రండి కొండ క్రిందకు" అని పిలిచారు
ఇంద్రుడు అడిగారు "ఎరా...! ఎంతమంది పడ్డారు ?? " . సహచరుడు "ఒక్కరూ పడలేదు ... సుఖంగా ఉన్నారు ..." అని చెపుతాడు
ఇంద్రుడికి అనుమానం వచ్చి వర్షాన్ని ఆపిస్తారు . పరమాత్మ దగ్గరకి వచ్చి చూసే సరికి దర్శనం ఇస్తారు
ఇంద్రుడు "ఎంత పొరపాటయిపోయింది క్షమించమంటారు "
ఐరావతం వచ్చి ఆకాశగంగను అభిషేకం చేసింది
కామధేనువు వచ్చి "మేము ఇవ్వటం కాదు నువ్వు గెలుచుకున్నావు గోవులను సంరక్షించుకొనటం వలన "గోవిందా" అను పేరు" అని అంటుంది
ఇంద్రుడి తల్లి వచ్చి ఇంద్రుడిని తిట్టి "ఆనాడు నిన్ను వామనమూర్తిలా వచ్చి కాపాడాడు ... ఈ రోజు నువ్వు చేసిన తప్పును క్షమించాడు .... అభిషేకం చెయ్యి" అని అంటుంది
ఇంద్రుడు పాలతో అభిషేకం చేస్తారు...
కామధేనువు పాలను వర్షిస్తుంది...