Thursday, December 26, 2013

శ్రీమద్భాగవతము - భాగము 77

శ్రీ చాగంటి గారి ప్రవచనములు  - శ్రీమద్భాగవతము

భాగము 77



రాసలీలా ఘట్టము

శరత్కాల పొర్ణమి రాత్రి వేణుగానం చేసారు స్వామి 

ఆ వేణుగానానికి కొంతమంది గోపికలు అక్కడికక్కడే మరణిస్తారు. మరికొంత మంది గోపికలు పరవశించి భర్త, అత్తమామలను , కొడుకులు వద్దంటున్నా వినకుండా కృష్ణుడితో రాసలీల చేయాలని వస్తే పరమాత్మ మందలిస్తారు....

అందుకు గోపికలు "నువ్వు అలా అనడం భావ్యం కాదు కృష్ణా...! " అంటారు 

** గోపికలకు వేణునాదం వింటే "అనంగవర్ధనం" అయింది ***

అనంగవర్ధనం అంటే - కామ ప్రేరేపణ  ; అనంగ - శరీరం లేని - మన్మధుడు 

కానీ అనంగవర్ధనం అంటే అసలు అర్థం "దేవుడి నుంచి పిలుపు వినపడడం"

"మీరు ఇలా రావడం తగదు, వెళ్ళిపోండి " అంటారు పరమాత్మ.
అందుకు గోపికలు " మేము ఎన్నో జన్మల తపస్సు వల్ల నిన్ను తెలుసుకోగలిగాము, మేము మళ్ళీ పతుల దగ్గరకు వెళ్ళము, మాకు మోక్షం ఇవ్వు" అని అడుగుతారు 

గోపికలు మేము ఆనందిస్తున్నాము అనుకోగానే కృష్ణుడు మాయమవుతారు. గోపికలు కృష్ణుడేడీయని చెట్లను, పుట్టలను అడుగుతారు.

పరమాత్మ నెమలిపింఛం పెట్టుకుంటారు... 

*** నెమలి సంపర్కం లేకుండా పిల్లలను కంటుంది... వసంత ఋతువులో నెమలి నాట్యం చేస్తూ కంటిలోంచి నీరు కారిస్తే , ఆ నీరు తాగి ఆడ నెమలి గర్భం దాలుస్తుంది  ***

పరమాత్మ రాసలీల చేసి వెళ్ళిపోతారు 

నారదుల వారు వచ్చి కంసుడికి కృష్ణ ఆచూకీ చెప్తారు...

కంసుడికి తన తల్లితండ్రుల వల్ల వచ్చిన శాపం  "నీ వాళ్ళందరూ నిన్ను ద్వేషిస్తారు" అని 

కంసుడు అక్రూరుడిని పిలిచి కృష్ణ బలరాములను "మీ మావయ్య యాగం చేస్తున్నారని" పిలవమంటారు 

అక్రూరుడు తన భాగ్యానికి సంతోషించి కంసుణ్ణి మెచ్చుకుంటారు ...

కృష్ణుడి వద్దకు వెళ్ళి విషయం చెప్తే , కృష్ణ బలరాములు తమను అడ్డుపడిన పరివారమును, గోపికలను మందలించి బయలుదేరుతారు ...

అక్రూరుడికి సంధ్యావందనం చేసుకుంటుండగా ఆదిశేషుడిలా దర్శనం ఇస్తారు పరమాత్మ 

కాలు మీద కాలు వేసి రుద్దడం - దరిద్రం - అది దేవతలను అవమానించినట్టే .... అందుకే మన పెద్దవాళ్ళు కాలు మీద కాలు వేసి కడుక్కోవద్దు అని చెబుతుండేవారు 




No comments:

Post a Comment