Sunday, December 29, 2013

శ్రీమద్భాగవతము - భాగము 78

శ్రీ చాగంటి గారి ప్రవచనములు  - శ్రీమద్భాగవతము

భాగము 78



కృష్ణ బలరాములు కంసుడి నగరం చేరుకుని విశ్రమిస్తారు....

ఒక చాకలి పట్టుబట్టలు పట్టుకెళుతుంటే పరమాత్మ పిలిచి బట్టలు అడిగారు...

అందుకు చాకలి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే "అన్నయ్యా ...! ఈ పుర్రె మారదు" అంటూ తల బద్దలుకొట్టి చంపుతారు..

ఆ చాకలి - త్రేతాయుగం సీతమ్మ వారి మీద నింద వేసినవాడు 

కృష్ణుడు బలరామునితో కలిసి వెళుతుండగా ఒక బట్టలు నేసే అతను పిలిచి బట్టలిచ్చారు... ఒక మాల కట్టే అతను పిలిచి మాల అలంకరించారు... అందుకు పరమాత్మ సంతోషించి "వరము నువ్వు అడుగు నేను ఇస్తాను" అంటే 

" నీ పాద కమల సేవయు...... " అని అడుగుతారు. పరమాత్మ వరమిస్తారు.

అంత్యమున వారందరికీ మోక్షం కలిగిస్తారు....

తరువాత ఒక త్రివక్ర (3 వక్రములు కలినినామె) "నాకు అందం లేదు... నువ్వు ఈ చందనం రాసుకో ... అందరికీ ఉండమంటే ఉంటుందా ..?? " అంటూ చందనం ఇస్తుంది.

కృష్ణుడు ఆమె పాదాన్ని తన పాదంతో తొక్కగానే ఆమె సౌందర్యవతి అయ్యి... సౌఖ్యమిస్తాను రమ్మంటుంది...

ఆమె సైరంధ్రి ( అంటే  పురుషులు అడగడమే తడువు వారికి కావలిసిన సౌఖ్యాన్ని ఇస్తారు )

"అలాగే కంస సంహారం తరువాత (అజ్ఞానం పోయాక) వస్తాను.... నేను పాంధుడను (ఇల్లు లేనివాడిని) " అంటారు స్వామి...

ముందుకు వెళ్ళి కంస పరివారాన్ని (సైన్యాన్ని) చంపుతారు ..

కంసుడికి భయం వేసి "కువలయాపాలకం" అనే ఏనుగును పంపిస్తాడు...

దాన్నీ చంపుతారు పరమాత్మ .... 

మల్ల యోధులతో యుద్ధము... కంస సంహారము...

జరాసంధుడు చెడ్డవారిని పోగేసి కృష్ణుడి మీదకు యుద్ధానికి వస్తాడు...

అలా 17 సార్లు జరాసంధుడిని చంపక అతడు తెచ్చే అక్షౌహిణీల సైన్యమును చంపుతారు....
18వ సారి ద్వారకకి ఏమవుతుందో అని సముద్రంలో చోటు అడిగి ద్వారక నిర్మిస్తారు...

నారదుల వారు కాలయమనుడిని (యాదవుల చేతిలో చావడు) పిలిచి కృష్ణుడి మీద యుద్ధానికి వెళ్ళమంటే... వెళ్తాడు...

అతడిని చూసి పారిపోతుంటారు కృష్ణుల వారు... అతడు వెంబడించి, వెంబడించి ఒక గుహలోకి వచ్చి, పడుకున్న వాడిని లేపితే వాడు చంపుతాడు (అతడే ముచికుందుడు)

మళ్ళీ జరాసంధుడు వెంబడిస్తే బలరామకృష్ణులు పారిపోతారు... పారిపోయి ఒక పర్వతంలోకి వెళ్ళిపోతారు... చీకట్లో కనపడకపొతే జరాసంధుడు ప్రవర్ధన పర్వతాన్ని కాల్చమని -- చనిపోయారనుకుని వెళ్ళిపోతాడు...

వారిద్దరూ ప్రక్కన సముద్రంలోకి దూకి ద్వారకకు ఈదుకుంటూ వెళ్తారు...

దశమ స్కంధం పూర్వోత్తర భాగాలు...

పూర్వ భాగము "రుక్మిణీ కళ్యాణం" వరకు చెప్తారు

No comments:

Post a Comment